ATP: అనంతపురం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు (ఏడీఏ) జీఎం అల్తాఫ్ ఖాన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆదిమూర్తినగర్లోని కార్యాలయాన్ని కక్కలపల్లికి మార్చినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై జేసీ విష్ణుచరణ్ నివేదిక పంపడంతో ప్రభుత్వం స్పందించింది.