SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం భౌమ వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.