KMM: కామేపల్లి మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో నేడు ఉదయం 10 గంటలకు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.