ADB: ప్రతి ఒక్క పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జాడి రాజలింగు అన్నారు. గురువారం నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామంలో సర్పంచ్ మెస్రం భీంబాయి మాణికరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.