MHBD: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన- 2027 కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు సీనియారిటీ ప్రాతిపదికన విధులు కేటాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) సభ్యులు కోరారు. గురువారం కొత్తగూడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక MROకు వారు వినతిపత్రం ఇచ్చారు. జనగణన విధుల కేటాయింపులో గర్భిణీ స్త్రీలు,100% వైకల్యం ఉన్న ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు.