MNCL: తాతయ్య అంత్యక్రియలకు వెళ్లి మనుమడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దేవన్న గురువారం తన తాత మరణించడంతో కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ దేవన్నకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో బంధువులు వెంటనే ఆయనను లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.