ATP: గుత్తిలోని 6 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు గురువారం ఇంగ్లీష్ పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయని ఎంఈవో రవినాయక్ తెలిపారు. రంజాన్ కారణంగా వాయిదా పడిన ఈ పరీక్ష గురువారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయ, పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.