PPM: జిల్లాలో 15 మండలాల్లో అంటువ్యాధులు కాని వ్యాధుల గుర్తింపుకు ఎన్.సి.డి సర్వే 4.0 ముమ్మరంగా కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించి మధుమేహం, రక్తపోటు బాధితులను గుర్తిస్తూ, అవసరమైన మందులు అందజేస్తున్నారు. జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధులు పెరుగుతున్నాయని సూచించారు.