జనగణనలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం సెన్సస్ పోర్టల్లో మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలి. ఆపై వచ్చే ‘SE ID’ని జనగణన అధికారికి ఇస్తే ధ్రువీకరణ పూర్తవుతుంది. అధికారులు మీ ఇంటికి వచ్చే వరకు వేచి ఉండాల్సిన పని లేకుండా ఇలా సులభంగా పూర్తిచేయవచ్చు.