NLG: ఉచ్చరాలతండాలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.