SRPT: అనంతగిరి మండలం పాత గోల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. గత ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల కోసం ప్రాంగణాలను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి, క్రీడా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.