గుంటూరులో టీ-20 సీనియర్ బాలుర క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి. GDCA ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ట్రయల్స్ నిర్వహిస్తారు. అరండల్పేట మాజేటి గురవయ్య మైదానంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు హాజరు కావాలి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత కిట్, కలర్ డ్రెస్తో రావాలి. ఆధార్, డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.