BDK: ఆపద సమయంలో 24 గంటలు అహర్నిశలు శ్రమిస్తూ, నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని 108 సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారని వైద్యులు రవితేజ అన్నారు. కరకగూడెంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవితేజ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.