AP: ఏలూరు జిల్లా నెమలిపేట గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐస్క్రీమ్లు తిని చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని, తమ గ్రామంలోకి ఐస్క్రీమ్ బండ్లు రావొద్దంటూ గ్రామ సరిహద్దులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నిబంధనను మీరి ఎవరైనా అమ్మితే రూ.3 వేలు, ఐస్క్రీమ్ కొన్న వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.