దేశీయ పరిశ్రమలకు ఊరటనిస్తూ సప్లయ్ లింక్ను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కొన్ని ముఖ్యమైన రసాయనాలపై దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ మినహాయింపులు నేటి నుంచి జూన్ 30 వరకు అమలులో ఉండనున్నాయి.