SRPT: జిల్లా నడిగూడెం నుంచి శాంతినగర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు వాహనదారులకు నరకప్రాయంగా మారాయి. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చే క్రమంలో కంకర పోసి వదిలేయడంతో, ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. ఇవాళ ఆదర్శ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కంకరలో దిగబడిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.