ప్రకాశం: కంభం పట్టణంలోని రహమత్ నగర్ మొదటి లైన్లో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని యాచకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.