NLG: బొప్పారానికి చెందిన అనంతుల లింగయ్య (45) మృతిపై అనుమానాలతో అధికారులు మంగళవారం రీ-పోస్టుమార్టం నిర్వహించారు. గత వారం కడుపునొప్పితో మృతి చెందిన లింగయ్య, పాముకాటు వల్ల చనిపోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.