AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుగ్గమ్మ గుడిలో సిబ్బంది చేతివాటం చూపించారు. హుండీ లెక్కింపులో బంగారాన్ని దారిమళ్లించేందుకు యత్నించారు. రోల్డ్ గోల్డ్ పెట్టి అసలైన బంగారం దోచేయబోయారు. అనుమానంతో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చేయించిన తనిఖీల్లో సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోగా.. EO శీనా నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు.