MNCL: క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికపై మరోసారి ఉత్కంఠ చోటుచేసుకుంది.