MDCL: జిల్లాలో కరెంట్ పొయ్యితో వంటలు వండుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని AE నరేష్ తెలిపారు. నీళ్లు పొయ్యిపై పడకుండా జాగ్రత్త పడాలని, ఇండక్షన్ స్టౌవ్కు సరిపోయే పాత్రలనే ఉపయోగించాలన్నారు. వైర్లు, ప్లగ్లు సరిగా ఉన్నాయో పరిశీలించాలని, వంట పూర్తయ్యాక స్విచ్ ఆఫ్ చేయడం తప్పనిసరని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నారు.