BHPL: రెవెన్యూ గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు BHPL జిల్లాలో వాలంటీర్ల నియామకం జరుపుతున్నట్లు వ్యవసాయ అధికారి బాబూరావు తెలిపారు. రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున 223 గ్రామాల్లో 669 మందిని నియమించనున్నట్లు వెల్లడించారు. వరంగల్ వ్యవసాయ క్షేత్రంలో మట్టి నమూనాలను విశ్లేషించే శాస్త్రజ్ఞులు వాలంటీర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు.