SRCL: వేములవాడ భీమేశ్వరస్వామివారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఉన్నారు.