KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన విడుదల చేసింది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. మంగళవారం ఆలయంలో సాధారణ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరిగి దర్శనం కల్పించనున్నారు.