AP: తూర్పుగోదావరి జిల్లా ప్రక్కిలంక SBI బ్రాంచ్లో భారీ మోసం చోటుచేసుకుంది. వెంకట నరసింహం అనే వ్యక్తి బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై రూ.6.87 కోట్ల విలువైన 25 ఏబీఎల్ రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. 2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు CID పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన CID పోలీసులు దర్యాప్తు చేపట్టారు.