NGKL: కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ క్యాంపు కార్యాలయంలో తిమ్మాజీపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.