SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కాయితోజు దిలీప్(26) అనే యువకుడు ఎంబీఏ చదివినప్పటికీ ఉద్యోగం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఇనుప రాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.