TG: సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమ బస్సు ఢీకొని పదోతరగతి విద్యార్థిని మృతి చెందింది. రుద్రారం నుంచి బైకుపై వెళ్తున్న విద్యార్థిని బస్సు ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.