MLG: రాష్ట్ర విద్యా కమిషన్ నివేదికపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (TPUS) జిల్లా అధ్యక్షురాలు వాంకుడోతు జ్యోతి డిమాండ్ చేశారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని కమిషన్ పేర్కొనడం ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆమె విమర్శించారు.