ఆసిఫాబాద్ మండలం మాణిక్ గూడ గ్రామంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న భూమి కోతకు శాశ్వత పరిష్కారం లభించింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు రూ. 52 లక్షల వ్యయంతో రక్షణ గోడ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. గోడ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.