కోనసీమ: ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వర్షిణి (988), వర్ధిణి (929)లను మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం సాయంత్రం ప్రత్యేకంగా అభినందించారు. కొత్తపేటలోని TDP నేత గుబ్బల మూర్తి నివాసానికి వెళ్లిన మంత్రి.. విద్యార్థినులను శాలువాతో సత్కరించారు. ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.