NRPT: ముదిరాజులను BC-D నుండి BC-A గ్రూపులోకి మార్చాలని కొడంగల్ ముదిరాజ్ సంఘం నాయకులు బీసీ కమిషన్ ఛైర్మన్కు వినతిపత్రం అందజేశారు. కావలి సాయిలు, పుష్పలత, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.