వనపర్తి జిల్లా తెల్లరాళ్లపల్లి తాండలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అద్భుతమైన ఆలయం నిర్మించడం హర్షణీయమని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, సోమనాథ్ నాయక్ తదితరులు ఉన్నారు.