NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను చిట్యాల మున్సిపాలిటీలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. పాలకవర్గం ముందు రోజే వార్డుల్లో చేపట్టవలసిన పనులపై సమీక్ష జరిపారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30 లకు 12వ వార్డులో ప్రారంభం కానుంది.