BDK: కొత్తగూడెంలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని మేయర్ గణేష్ సూచించారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.