NGKL: ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ వైభవంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దంపతులు డా. కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.