NRML: రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. భైంసా నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయమైన ధర కల్పిస్తామని తెలిపారు. గొల్లమాడ, తిమ్మాపూర్ గ్రామాల రైతులు వినతి పత్రం అందజేయగా స్పందించారు. ఇప్పటికే కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభించామని, అవసరమైన చోట్ల త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.