SDPT: మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కూడలిలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.