PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఇంటికి సోలార్ సదుపాయం అందేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సోలార్ వినియోగంతో విద్యుత్ ఖర్చు తగ్గి గ్రామం స్వయం సమృద్ధిగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.