HYD: ఆర్టీసీ డైలీ బసు పాస్ ధర స్వల్పంగా పెరిగింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డైలీ పాస్ చార్జీలను రూ.150 నుంచి రూ.130కి తగ్గించగా.. తాజాగా ఈ రాయితీని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. దీంతో యథావిధిగా డైలీ పాస్ చార్జీ రూ.130 నుంచి రూ.150కు పెరిగింది. ఈ పాస్ పైన ప్రయాణికులు ఏ బస్సుల్లోనైనా 24 గంటల పాటు ప్రయాణం చేయవచ్చు.