NZB: గడిచిన 24 గంటల్లో భీమ్గల్లో 43.5°Cల ఉష్ణోగ్రత నమోదు కాగా, కామారెడ్డి జిల్లా మేనూర్లో 43.4°Cల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇవి రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలుగా అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండ వేడి తాళలేక సతమతమవుతున్నారు. రోజంతా ఉక్కపోత భరించలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.