WNP: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన సమగ్ర విద్యా, విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.