JGL: సంగెంలో నిర్వహిస్తున్న కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజుకు చేరుకుంది. NSS అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలంటీర్లు ప్రాథమిక పాఠశాలలో’స్వచ్ఛ భారత్’ నిర్వహించి, పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం న్యాయవాది ప్రేమ్ సాగర్ హాజరై’ చట్టాలపై అవగాహన’ అనే అంశంపై ప్రసంగించారు. సమాజంలో శాంతి,సమానత్వం నెలకొల్పడానికి చట్టాలు దోహదపడాయన్నారు.