PDPL: ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం సర్వారం గ్రామానికి చెందిన గౌరిశెట్టి రాజయ్య నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రత్నం శైలేందర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు డా.చిన్న రాముకు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లు అందని వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.