BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం తెలిపారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం అర్చకులు అందజేయగా, స్వామివారి లడ్డు ప్రసాదం ఆలయ అధికారులు అందజేశారు.