ADB: ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేయటం జరుగుతుందని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రూపేష్ అన్నారు. నిన్న బేల మండలం సాంగిడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రూ. 5 లక్షల 40 వేల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.