KMR: బీర్కూరు మండలంలోని బరంగు ఏడిగి గ్రామంలో గురువారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 142 మందికి పరీక్షలు చేయగా, 37 మందికి మోతిబిందు సమస్య ఉన్నట్లు వైద్య సహాయకులు అజయ్, రాకేశ్ తెలిపారు. వీరికి బోధన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, సర్పంచ్ అనిల్, హనుమంతరావు పాల్గొన్నారు.