BDK: ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వరప్రసాద్ ఆరోపించారు. శనివారం కొయ్యూరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. చర్ల మండలం కేంద్రంలో ఏజెన్సీ చట్టాలను గిరిజనేతరులు అతిక్రమిస్తున్న అధికారులు మౌనం పాటిస్తున్నారని చెప్పారు.