KMM: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నకిలీ వాట్సాప్/SMS లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, KYC అప్డేట్ పేరుతో OTP అడగడం వంటి మోసపూరిత చర్యలకు నేరగాళ్ళు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారిక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరారు.