జగిత్యాల జిల్లా నెట్బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.